ప్రధానిగా రాజీవ్ గాంధీ సేవలు మరువలేని
మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.జగదీశ్వర్ గౌడ్
మే 21, నల్లా సమాచార్ న్యూస్, శేర్లింగంపల్లి :
40 సంవత్సరాల వయసులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీ యువతకు రాజకీయాల్లో మార్గదర్శకుడిగా నిలిచారు అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. భారతదేశపు గొప్ప కుమారుడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం హుడా కేఫ్ నందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్నికి ఎంబిసి డెవలప్మెంట్ చైర్మన్ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.జగదీశ్వర్ గౌడ్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
“ఓటు వేసే వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం, పంచాయతీ రాజ్ను బలోపేతం చేయడం, టెలికాం మరియు ఐటీ విప్లవం, కంప్యూటరైజేషన్ కార్యక్రమాలు, శాంతి ఒప్పందాల కొనసాగింపు, మహిళా సాధికారత, సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం సమ్మిళిత విద్యపై ప్రాధాన్యతతో కొత్త విద్యా విధానం వంటి ఆయన అనేక ముఖ్యమైన కార్యక్రమాలు దేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చాయని, ప్రధానిగా రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తన తల్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి, సీనియర్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, వీరమల్ల వీరేందర్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ అలీ ,మాజీ కౌన్సిలర్ కట్ల రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, సత్యం గౌడ్, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్ ఉదయ్, రవి, బాష్పక యాదగిరి, జహంగీర్, నగేష్ నాయక్, గిరి, సుధాకర్, జ్యోతి, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, ఎ-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి, అధ్యక్షురాలు రేణుక, నాయకులు కట్ల శేఖర్ రెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, ఆయాజ్ ఖాన్,శేఖర్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, సౌందర్య రాజన్, విజయ్ భాస్కర్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివరావు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.