వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు : కార్పొరేటర్ RNY
నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ (నల్ల సంజీవ రెడ్డి)శేరిలింగంపల్లి డివిజన్:డివిజన్ అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతున్నామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. నల్లగండ్ల చెరువు నుండి బిహెచ్ఇఎల్ చౌరస్తా, ఇండియన్ గ్యాస్ గోడౌన్ నాలా వరకు SNDP అండర్ H-CITI లో భాగంగా రూ. 28 కోట్లు 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపడుతున్న ఓపెన్ డ్రైన్ RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులను సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నాలాల విస్తరణ పనులతో లోతట్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం అని పేర్కొన్నారు. RCC బాక్స్ డ్రైన్ పనులు నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా స్థానికవాసులకు ఇబ్బంది కలగకుండా రాబోయే వర్షాకాలంలోపు పరిసర ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, ఎస్ఎన్డిపి జిహెచ్ఎంసీ డిఈ రాజు, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, కే.రాంచందర్, కొండల్ రెడ్డి, నారాయణ, లక్ష్మణ్, బచ్చు రాజు, ఖాజా పాషా, గోవింద్ చారీ, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, పవన్, రాము, గోపాల్, సయ్యద్ మీర్ అలీ, అహ్మద్, సుభాష్, యాదగిరి, సురేష్, మహేష్ చారీ, రాజు, వినయ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.