శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎ-బ్లాక్ మహిళా కాంగ్రెస్ కమిటీకి నియామక పత్రాలు అందజేత
నల్లా సమాచార్ న్యూస్, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి బీమ్ భరత్ ఆదేశాల మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, ఏ-బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి ఆధ్వర్యంలో ఏ-బ్లాక్ మహిళా కాంగ్రెస్ కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. ఈ కమిటీలో వైస్-ప్రెసిడెంట్ గా సులోచన, జనరల్ సెక్రటరీలుగా యోగేశ్వరి దేవి, కృష్ణవేణి, జాయింట్ సెక్రటరీలుగా శారద, అనితాబాయిలకు నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అరుణ, రమాదేవి నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ తన్వీర్ బేగం సెక్రెటరీ కృష్ణకుమారి, వల్లి తదితరులు పాల్గొన్నారు.