ఈడబ్ల్యూయస్ వర్గాలకు రాజీవ్ యువ వికాసం పతకం వర్తింపజేయాలి
– ప్రభుత్వ ప్రతి పతకంలో పేద ఈడబ్ల్యూఎస్ విద్యార్థిని – విద్యార్థులకు, యువకులకు అవకాశం కల్పించాలి
– మేమెందుకు అనర్హులం ఈ పథకానికి
-10 శాతం ఈడబ్ల్యూయస్ రిజర్వేషన్స్ కు చట్టభద్దత కల్పించాలి.
– ఈడబ్ల్యూయస్ కమీషన్ ఏర్పాటు చేయాలి.
నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ లో ప్రభుత్వ పతకాలకు పేద రెడ్డి నిరుద్యోగ యువతి యువకులను, ఈడబ్ల్యూయస్ వర్గాలను, అగ్రవర్ణం అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తుందని ఈడబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నేపల్లి లింగా రెడ్డి అన్నారు.
రాజీవ్ యువ వికాసం పేరుమీద మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనిలో మన ఈడబ్ల్యూయస్ (రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలిమ, కమ్మ, రాజులు తదితర) వర్గాలను నిరుద్యోగ ఈ డబ్ల్యూ ఎస్ యువతీ యువకులను పూర్తిగా పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీవ్ యువ వికాసం పతకంలో ఈడబ్ల్యూయస్ వర్గాలకు అవకాశం కల్పించాలి, అంతే కాకుండా ప్రభుత్వ ప్రతి పతకంలో పేద రెడ్డి విద్యార్థిని – విద్యార్థులకు, యువకులకు అవకాశం కల్పించాలి అని అన్నారు.
సామజిక న్యాయం అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఈడబ్ల్యూయస్ వర్గాలపై వివక్ష చూపుతుంది, పట్టించుకోవడం లేదు అన్నారు. రాష్ట్రంలో కొద్ది మంది చేతిలో పాలన నడుస్తుందంటారు, ఆ సామాజిక వర్గ పాలన అంటే, మాకు ప్రభుత్వ పతకాలలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అన్నారు. ఒక పది మంది రెడ్డి రాజకీయ నాయకులు మరియు పది మంది రెడ్డి వ్యాపార వేత్తలు బాగుంటే మొత్తం రెడ్డి సామజిక వర్గం బాగున్నట్టేనా అని ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచన చేయండి. అన్ని సామజిక వర్గాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూయస్ రిజర్వేషన్స్ కు కూడా చట్టభద్దత కల్పించడంతో పాటు ఈడబ్ల్యూయస్ కమీషన్ ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడబ్ల్యూఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.