ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి
ఫిబ్రవరి 22, నల్లా సమాచార్ న్యూస్ :
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు. అలాంటి చరిత్ర కలిగిన వీర మరణం పొందిన సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారికి మనము ఘణ నివాళులు అర్పిద్దాం, నిత్యం స్మరిద్దాం.