జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
జనవరి 26, నల్లా సమాచార్ న్యూస్ / మణుగూరు (జిల్లా ప్రతినిధి లెనిన్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 76 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని, అడ్డంకులు తొలగిస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోతుందని రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకెళుతోందన్నారు. జాతి సమైక్యత కోసం అందరం కృషి చేయాలని కోరారు. ఈ రాష్ట్రం ఈ జెండా,ఈ దేశం నావే అనే స్ఫూర్తితో మెలగాలని తెలియజేసి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మణుగూరు మండల మహిళా అధ్యక్షులు సౌజన్య, మణుగూరు శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.