శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక అందరి ఆమోదయోగ్యమైనది కాదు…
కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి..
జనవరి 17, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలి ఎన్నికను వెంటనే రద్దు చేయాలని అందరి ఆమోదయోగ్య విధంగా నూతన అధ్యక్షురాలిని ఎన్నుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని శేరిలింగంపల్లి మహిళ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్మి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.