ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి దంపతులు
జనవరి 10, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్ధానిక సూర్యాపేట పట్టణం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయం నందు ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు పటేల్ రమేష్ రెడ్డి దంపతులకు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి దంపతులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామి వారిని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్ద ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం నందు భక్తుల సౌకర్యం చేసిన ఏర్పాట్లను ప్రధాన అర్చకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.