కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి
బుడ్డా వెంగళరెడ్డి దాన గుణం, గొప్పతనం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతయినా ఉంది. బుడ్డా వెంగళరెడ్డి జీవన ప్రస్థానంలోని ముఖ్యాంశాలు :
1866 కాలంలో వెంగళరెడ్డి కీర్తి ప్రతిష్ఠలు విన్న కరువు బారిన పడ్డ పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు.వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారిఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు. పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా తిండి పెట్టారని అంచనా, స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.ఈయన సేవలను గుర్తించి అప్పటి బ్రిటీషు ప్రభుత్వం విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించింది. అప్పటి ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది.రెడ్డి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31, 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు.
– రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి