రెడ్డి కార్పొరేషన్ కు చట్టబద్ధత, పాలకవర్గం, నిధులు కల్పించాలి
-రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీల డిమాండ్
-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి తదితర నాయకులు
డిసెంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / పరకాల :
రెడ్డిల సమస్యలను వివరిస్తూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డికి తెలంగాణ రెడ్డి సంఘం వినతి పత్రాన్ని అందజేసింది. సందర్భంగా అనేక సంవత్సరాల నిరుపేద రెడ్ల పోరాటాలను, నిరు పేద రెడ్డి విద్యార్థులకు అగ్రకులం పేరుతో ఉపాది అవకాశాలలో ఎలాంటి ప్రభుత్వ సహయం లేకపోవడం వలన వాటి ఫలాలు పొందలేక పోతున్నారన్న విషయం మీకు విధితమే. గత 10 సంవత్సరాలలో నిరుపేద రెడ్లు జరిపిన సభలు, సమావేశాలు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు, ధర్నాలు, రాస్తారోకోలు, అసంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని పేర్కొన్నారు. ఆరెస్టులు, గృహనిర్భాందాలు చేసినప్పటికి వెర్వకుండా నిరుపేద రెడ్లు ఉద్యమాలతో పాటు అనేక పట్టణాలలో, గ్రామాలల్లో రెడ్డి పరపతి సంఘాలు, రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు కొంత మేరకు సహాయసహాకారాలు అందిచడం జరుగుతుంది అని, కాంగ్రేస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలో రెడ్డి కార్పోరేషన్ రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించింది. కాని నేటి వరకు విధి, విధానాలు ప్రకటించలేదు, నిధులు కెటాయించలేదు, పాలకవర్గాన్ని ప్రకటించలేదు. దీని వల్ల నిరుపేద రెడ్లు అశించిన ఫలితం రాలేదని తీవ్ర అవేదనకు గురి అగుచున్నారు వినతి పత్రంలో తెలిపారు.
కావున దయచేసి వెంటనే రెడ్డి కార్పోరేషన్కు చట్టబద్ధతతో పాటు నిధులు కేటాయించాలని విధి, విధానాలు ప్రకటించాలని, రెడ్డి కార్పోరేషన్కు చెర్మెన్తో పాటు పాలకవర్గాన్ని ప్రకటించాలని, ఈడబ్ల్యూఎస్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర జాతీయస్థాయిలో ఈడబ్ల్యూస్ కమీషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అర్జుల కిషన్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు పాల్గొన్నారు.