గచ్చిబౌలి డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని కోరిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.
నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పన కు నిధులు మంజూరు చేయాలని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, గోపనపల్లి తండాకు చెందిన సీనియర్ నాయకులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సి సి రోడ్డు, యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, విధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు. దీనికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, త్వరలోనే డివిజన్ లో పర్యటిస్తానని, గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంజీవ, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు దయాకర్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, యాదయ్య, ఆంజనేయులు, శ్రీశైలం, ప్రకాశ్ నాయక్, వేణు ప్రవీణ్ గౌడ్, దుర్గ రామ్, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.