అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ కి ఘన నివాళి
నల్లా సమాచార్ న్యూస్ / మియాపూర్ :
ఈ రోజుమియాపూర్ MA నగర్ లో కామ్రేడ్ అమరజీవి తాండ్ర కుమార్ విగ్రహం వద్ద ఏఐఎఫ్ డి డబ్ల్యు గ్రేటర్ కమిటీ ఆద్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ కి నివాళి అర్పించటం జరిగింది. పక్షోత్సములో చివరి రోజైన ఈరోజు నివాళులు అర్పించటం జరిగింది. గ్రేటర్ కమిటీ అధ్యక్షురాలు వి.అవిత అద్యక్షతన జరిగింది.
రాష్ట్ర అధ్యక్షురాలు ఏ.పుష్ప అతిధిగా రావటం జరిగింది. గ్రేటర్ సభ్యురాళ్లు అందరు హాజరయినారు. ప్రస్తుత రాజకీయాలు – మార్కిస్ట్ – అంబేద్కర్ ఆలోచనా విధానం గురించి మాట్లాడటం జరిగింది. అంగడి పుష్ప మాట్లాడుతూ దేశాన్ని పాలించిన దోపిడి వర్గ మతోన్మాద, అవినీతి, అవకాశ వాదద, పార్టీలు రాజకీయును దిగజార్చినాయి అని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచి చట్ట సభలను శాసించిన పార్టీలు “అనుకూలమైన చట్టాలు చేయకుందా. దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకుండ దిగజార్చి నాయని తెలియ జేశాయి. ఈ సమావేశానికి గ్రేటర్ సభ్యురాలు జి.శివాని, ఎం.డి అమీనా బేగం, ఎస్ గీత, ఎండి సుల్తానాబేగం, ఎండి రజియావేశం బి. యాదమ్మ, నిర్మల, రాధిక తదితరులు పాల్గొన్నారు.