నవంబర్ 7 వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి
-యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా (ఐక్య) – (MCPIU), రివల్యూషనరి మార్క్సిస్టు పార్టీ ఆప్ ఇండియా – (RMPI)ల ఆద్వర్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు కో-ఆర్డినేషన్ కమిటీ(C C C) సమావేశం లు నవంబర్ 5,6,7 తేదీలలో హైదరాబాద్ బాగ్ లింగం పల్లి ఓంకార్ భవన్ లో జరుగుతున్న సందర్భంగా అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 7న ఉదయం 10-30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మతోన్మాద కార్పోరేట్ శక్తుల ప్రమాదం – వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం అనే అంశంపై జాతీయ సెమినార్ ను జయప్రదం చేయాలని యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు నిచ్చారు. ఈ రోజు బాగ్ లింగం పల్లి ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ సెమినార్ గోడ పత్రిక(పోస్టర్) ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం లో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, వనం సుధాకర్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర కళావతి గార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ దేశం లో కమ్యూనిస్టు పార్టీ లు ఐక్యంగా లేక పోవటం వలన దేశ ప్రజలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అణిచివేత కు గురై పేదరికం, నిరుద్యోగం, అసమానతలు తీవ్రంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది అని వీటికి మరింత ఆజ్యం పోసినట్టుగా కేంద్రం లో అదికారంలో ఉన్న మైనారిటీ బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్దం చేస్తున్నది అని దేశం లో 80 శాతం ఉన్న హిందూ ప్రజలపై జి యస్ టి పేరుతో, రైల్వే రంగం ప్రైవేటీకరణ పేరుతో, యల్ ఐ సి, రక్షణ రంగం, విమాన యానం,ఓడ రేవులు, చివరి కి యుద్ద రంగంలో వాడుతున్న పరికారాలను కూడా కార్పోరేట్ సంపన్న వర్గాల కు ఆదాని, అంబానీ లకు అప్పచెప్పి, 78 సంవత్సరాల కాలం నుంచి ఉన్న విదేశాంగ విధానాన్ని కూడా దెబ్బ కొట్టేందుకు కూడా వెనుకాడడం లేదు అని అందులో బాగంగా నే ఆదాని ఏరో అండ్ డిఫెన్స్ కంపెనీ హెర్మస్ 900 అనే డ్రోన్లను ఇజ్రాయెల్ కు సరపరా చేస్తు ఈ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారుతున్న ది. ఈ కార్పొరేట్ వర్గాల దోపిడీ యదేచ్చగా సాగేందుకు ఫాసిస్టు విధానాలను అనుసరించి ప్రజా పోరాటాల ను ఉద్యమాలను అణిచి వేస్తున్నది అని దీనికి ప్రజా పక్ష పార్టీలు అయిన కమ్యూనిస్టు పార్టీ లు తగిన ఐక్య కార్యాచరణ తో ముందుకు వెళ్ళుటకు యంసిపిఐ(యు)- ఆర్ యం పి ఐ ల ఆద్వర్యంలో కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ జాతీయ సెమినార్ అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ స్పూర్తితో నవంబర్ 7 వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10-30 నిమిషాల కు ప్రారంభం అయి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది అని దీనికి వామపక్ష మేదావులు, విద్యావంతులు, ప్రజాతంత్ర వాదులు,యువతవిద్యార్థి, కార్మిక సకల వర్గాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.