ఆల్ ఇండియామహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో సత్తా చాటిన శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్
అక్టోబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 15 వ తేదీ నుండి మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం జరిగింది. సెప్టెంబర్ 15 నుండి 30 వ తేదీ వరకు జరిగిన మొదటి టార్గెట్ లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం మరియు జాతీయస్థాయిలో మూడవ స్థానం లో నిలచిన ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదులలో మొదటి రెండవ మూడవ స్థానాలలో నిలిచిన వారందరినీ ఢిల్లీకి పిలిచి సన్మానించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆధ్వర్యంలో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.ఢిల్లీలోని ఇండియన్ హ్యాబిటెడ్ సెంటర్ లో జరిగిన, ఈ సన్మాన సభకి ఎమ్మెల్యే మరియు నేషనల్ రెజ్లర్ వినీష్ బోగాట్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, అందరికీ అప్రిషియేట్ సర్టిఫికెట్స్ మరియు శాలువాలతో సన్మానించడం జరిగింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ ఎమ్మెల్యే మరియు నేషనల్ రెజ్లర్ వినీష్ బొగటా మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్న ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబులఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుండి కృష్ణవేణి, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.