రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యాలాల మండల నాయకులు
అక్టోబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ / వికారాబాద్ :
యాలాల మండలం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. యాలాల మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని విన్నవించగా అందుకు వెంటనే స్పందించిన మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్ ను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని మహేందర్ రెడ్డి చెప్పారు.