ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించటం గొప్ప పరిణామం : వి.జగదీశ్వర్ గౌడ్
అక్టోబర్ 20, నల్లా సమాచార్ న్యూస్, శేరిలింగంపల్లి :
ఆల్విన్ కాలనీ డివిజన్ జయ శంకర్ కాలనీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఆదివారం జయ శంకర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్ ఆధ్వర్యంలో శ్రద్ధ గ్లోబల్ హాస్పిటల్ వారిచే ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించటం గొప్ప పరిణామం అని అభినందించారు. డాక్టర్లు డి. వై. నాయుడు ఎంబీబీఎస్ ఏ ఎఫ్ ఐ హెచ్ (మెడికల్ డైరెక్టర్) సౌమ్య (గైనకాలోజిస్ట్), ఉమా(ఫిజిషియన్), వెంకట కుమారి, విజయ్ భార్గవ్ (జనరల్ మెడిసియన్) స్టాఫ్ స్వప్న, సుధారాణి, సువర్ణ, అనిల్ తో కలిసి ప్రజలకు ఈసీజి, బిపి, షుగర్, జనరల్ హెల్త్ గైనకలజిస్ట్, ఫిజీషియన్ సేవలు అందించారు. సుమారు 350 మంది వినియోగించుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై ఎం.విగ్నేష్, జయ శంకర్ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.