కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఘన సన్మానం
బండనాగారము నుండి కట్కుర్ 5.5 కి.మి ల బీటీ రోడ్డు మంజూరీ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అక్టోబర్ 18, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండ నగరం నుండి కట్కూర్ వరకు బీటీ రోడ్డు మంజూరు చేయించినందుకు గాను హైదరాబాద్ బంజారా హిల్స్ లో గల జనగామ జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నివాసం లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పన, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న, బచన్నపెట మండల కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ కోల్ల నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల సురేందర్ రెడ్డి, ఇజ్జగిరి రాములు, గ్రామ కమిటీ కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీధర్ రెడ్డి. పార్టీ సీనియర్ నాయకులు చల్ల రమేష్ రెడ్డి, జంగిలి స్వామి, ఇజ్జాగిరి నరేష్, ఆరేళ్ల బాస్కర్, ఇజ్జగిరీ పరుశరాములు, ఎల్ల చంద్రారెడ్డి, బత్తిని సాయిబాబా, పార్టీ కార్యనిర్వహన మానేపల్లీ బాపురాజు, మానేపల్లి మల్లయ్య, పార్టీ యూత్ గండి సురేష్, ఇతర జిల్లా స్థాయి, మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్స్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.