సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
అక్టోబర్ 14, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ, వారికి వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన రెడ్డి తో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధితుడు మొహమ్మద్ అర్షాదుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్ కళ్యాణ్, ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.