గౌడన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత…
కాటమయ్య రక్ష కిట్ లను పంపిణి చేసిన ఎమ్మెల్యే..
అక్టోబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ / హనుమకొండ :
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు, వృత్తి అదారిత కుటుంబాలకు అండగా ఉంటుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హనుమకొండ జిల్లా బి సి సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సోదరులకు కాటమయ్య రక్షా కిట్ లను పంపిణి చేశారు. పండుగ వేళ గౌడన్నలకు రక్ష కిట్ లను నా చేతుల మీదుగా పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వం తరపున అందిస్తున్న కిట్ వలన ప్రాణాపాయా స్థితుల నుంచి కాపాడటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గౌడ కులస్తులకు జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హల్ ఏర్పాటుకు కృషి చేస్తాను తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్, జిల్లా అధ్యక్షులు శ్రీపతి గోపి,ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ చంద్రశేఖర్, జిల్లా వెనుకబడిన శాఖ అధికారి రామ్ రెడ్డి, గౌడ్ కుల నేతలు, నాయకులు, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.