అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన కోడూరు శివకుమార్ గౌడ్
అక్టోబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో తేలు నరసయ్య (90) అనారోగ్యంతో మృతిచెందగా కోడూరు శివకుమార్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం చెప్పి వారికి 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందించాడు. పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ తనవంతుగా సాయం చేస్తున్న కోడూరు శివకుమార్ గౌడ్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్గా సిద్ధిరాములు, యాట రామచంద్రయ్య, పిట్టల ఇస్తారి, తెలు శ్రీనివాస్, తేలు కిష్టయ్య, కుందారపు దశరథ, నీరటి బైరయ్య, కొమ్ము ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.