నూకల నరేష్ రెడ్డి సంతాప సభ
రెడ్డి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన సభ
అక్టోబర్ 06, నల్లా సమాచార్ న్యూస్ / హనుమకొండ :
రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారుడు నూకల నరేష్ రెడ్డి రెండు రోజుల క్రితం అకాల మరణం చెందగా రెడ్డి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండలోని హంటర్ రోడ్, అభిరామ్ గార్డెన్ లో సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో సంఘాలకు అతీతంగా రాష్ట్రంలోని రెడ్డిలు హాజరై అయినఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
చివరిసారిగా ఆయనతో అనుబంధాల్ని, మధుర స్మృతులను గుర్తుకు చేసుకుంటూ ఆయన మహోన్నతను కొనియాడారు. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుని కోల్పోయామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు జిల్లా కమిటీ నాయకులు వివిధ సంఘాల రెడ్డి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.