శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరుకు ప్రత్యేక ధన్యవాదాలు : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్
రానున్న రోజుల్లో తమ దృష్టికి వచ్చినా పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
అక్టోబర్ 05, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీ చొరవ చాలా ఉందని, రానున్న రోజుల్లో తమ దృష్టికి వచ్చినా పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు నందు విజేత సూపర్ మార్కెట్( వైశాలి నగర్) ఎదురుగా ఉన్న మంజీర రోడ్డు నుండి మై హోమ్ జెవెల్ వెనుక గేట్ వరకు రూ.195.00 లక్షలతో మరియు హఫీజ్పెట్ ప్లై ఓవర్ నుండి విజేత సూపర్ మార్కెట్ వరకు మంజీర రోడ్డు లో రూ.197.00 మరియు ఆర్టీసీ కాలనీ నుండి జాతీయ రహదారి వరకు మురళీధర్ సొసైటీ నందు రోడ్డు రూ.39.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్, చందనగర్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, ఈఈ సుదర్శన్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..