హైదరాబాద్: ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతె శోభన్ రెడ్డి గారితో కలిసి తార్నాక లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో శ్రీ జి. వెంకటస్వామి (కాకా) గారి 95వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ వెంకటస్వామి గారి సేవలను గుర్తుచేసుకున్నారు. శ్రీ జి. వెంకటస్వామి గారు తన రాజకీయ జీవితంలో రాష్ట్రాభివృద్ధికి చేసిన అనేక సేవలు, కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్, ప్రైవేట్ ఉద్యోగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, విజయకుమార్, సుధాకర్, రాము, కిరణ్, భాస్కర్ నాయకులు పాల్గొన్నారు.