రెడ్డి సంఘం తెలంగాణ ముఖ్య సలహాదారులు నూకల
నూకల నరేష్ రెడ్డి మరణం తీరని లోటు.
తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు నూకల నరేష్ రెడ్డి మరణం రెడ్డి సంఘానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు గోపు జై పాల్ రెడ్డి అన్నారు. వారి మరణం పట్ల ఈరోజు పోస్టల్ కాలనీ రెడ్డి సంగం కార్యాలయం లో సంతాపం వ్యక్తం చేశారు. గతంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి నూకల నరేష్ రెడ్డి సంఘం బలోపేతానికి కృషి చేశారని రెడ్ల ఐక్యత కోసం వారు చేసిన కృషి మరువలేనిది అన్నారు రెడ్డి సంఘం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని విచారణ వ్యక్తం చేశారు.సంతాపం వ్యక్తం చేసిన వారిలో రావుల నర్సింహ రెడ్డి,అర్జుల కిషన్ రెడ్డి, జి. ప్రభాకర్ రెడ్డి,నల్ల రాజిరెడ్డి,చాడా జైహింద్ రెడ్డి,గణపతి రెడ్డి,ప్రకాష్ చందర్ రెడ్డి,వెంకటరెడ్డి,నంద్యాల కృష్ణ రెడ్డి మరియు నేపాల్ పర్యటనలో ఉన్న రెడ్డి సంగం నాయకులు కామిడి సతీష్ రెడ్డి నేపాల్ లో వారి మరణం పట్ల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు.