రెడ్డి కార్పొరేషన్ కి చట్టబద్ధత కల్పించండి – రెడ్డి సంఘం తెలంగాణ
-నిధులు, విధివిధానాలపై స్పష్టతనివ్వాలి
-రెడ్డి కార్పోరేషన్ చైర్మన్, పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
-తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కీలక నేతలకు వినతి పత్రం అందజేసిన రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు
నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి పాలకవర్గాన్ని నియమించాలని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, నిధులు, విధివిధానాలను సూచిస్తూ, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డిలను కలిసి రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు వినతిపత్రం అందించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్య నేతలతో రెడ్డి సంఘం తెలంగాణ ముఖ్య నాయకులు
అనేక సంవత్సరాల నిరుపేద రెడ్ల పోరాటాలను, నిరుపేద రెడ్డి విద్యార్థులకు అగ్రకులం పేరుతో ఉపాధి అవకాశాలలో ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకపోవడం వలన, వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్న విషయం మీకు విదితమే అని, గత పది సంవత్సరాలలో నిరుపేద రెడ్ల కోసం జరిపిన సభలు, సమావేశాలు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు- ధర్నాలు రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినప్పటికీ, ఏడ్వకుండా నిరుపేద రెడ్లకోసం ఉద్యమాలతో పాటు అనేక పట్టణాలలో, గ్రామాలలో రెడ్డి పరపతి సంఘాలు – రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు కొంతమేరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది అని వినతి పత్రంలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం వంద రోజులలో “రెడ్డి కార్పోరేషన్” ఏర్పాటు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. కానీ నేటివరకు విధివిధానాలు ప్రకటించలేదు, పాలకవర్గాన్ని ప్రకటించలేదు. దీనివల్ల నిరుపేద రెడ్లు ఆశించిన ఫలితం రాలేదని తీవ్ర ఆవేదనకు, మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు అని అన్నారు.
కావున దయచేసి వెంటనే రెడ్డి కార్పోరేషన్ చట్టబద్ధతతో పాటు నిధులు కేటాయించాలని, విధివిధానాలు ప్రకటించాలని, రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గాన్ని కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. నిరుపేద రెడ్డిలకు న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు విన్నవించడం జరిగింది.
అంతేకాకుండా నిరుపేద రెడ్డి యువతీ-యువకులకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉ పయోగకరమైన ఈడబ్ల్యూఎస్ (EWS) ను విద్యా ఉద్యోగ అవకాశాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మరియు “EWS ఈడబ్ల్యూ ఎస్ కమీషన్” ను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయుటకు కృషిచేయాలని “రెడ్డి సంఘం తెలంగాణ” తరపున తమరికి విజ్ఞప్తి చేయుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం తెలంగాణ ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు.
ఈ రోజు రోడ్లు మరియు భవనాలు కార్పోరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డిని కలిసి, రెడ్డి కార్పోరేషన్ విది- విధానాలు మరియు ఈడబ్ల్యూఎస్ పూర్తి స్థాయి లో అమలు జరగాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.