మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు శ్రీ.దేవవత్ సురేష్ నాయక్ గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది..
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు..
ఈరోజు వారి కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి గారు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వి.జగదీశ్వర్ గౌడ్ గారు,ఎం.బి.సి చైర్మన్ శ్రీ.జేరిపేటి జైపాల్ గారు..
ఈ సందర్భంగా సురేష్ గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు మరవలేనివని,వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు,జిల్లా నాయకులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు,మహిళ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..