మహబూబ్ నగర్ మార్కెట్లోకి నూతన హ్యుందాయ్ అల్కాజర్ కారు విడుదల
———————
ట్రెండ్ హ్యుందాయ్ , మహబూబ్ నగర్ కారు షోరూం నందు హ్యుందాయ్ నూతన అల్కాజర్ కారును మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, హ్యుందాయ్ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ గట్టు గోపాల్ రెడ్డి తో కలిసి మహబూబ్ నగర్ మార్కెట్ లోకి విడుదల చేసారు . ఈ సందర్భముగా గట్టు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ హ్యుందాయ్ ఎప్పడికప్పుడు నూతన ఆవిష్కరణలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నూతన వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తుందని తెలిపారు .ఈ నూతన అల్కజర్ కారు 6,7 సీట్లతో 73 భద్రత ప్రమాణాలను కలిగి ఉన్నదని , ఈ కారు పెట్రోల్, డీజిల్ విభాగములో మాన్యుయల్, ఆటోమేటిక్ గేర్లు కలిగి , పెట్రోల్ విభాగములో 18.66 కిలోమీటర్ల , డీజిల్ 19.63 కి.మీ. మైలేజ్ ఇస్తుందనీ తెలిపారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు, 6 వేరియంట్స్ లో లభిస్తుందని తెలిపారు. లెవెల్ 2 మెమొరీ సీట్ రిమైండర్ తో 360 డిగ్రీ కెమెరా కలిగివున్నదని తెలిపారు. ఈ కార్యక్రమములో చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ గట్టు హర్షిత్ రెడ్డి , యుక్త మోటర్స్ సీఈఓ గట్టు సిరిచందన రెడ్డి , సేల్స్ మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి, సర్వీస్ మేనేజర్ ఎండీ వసీం పాల్గొన్నారు .