తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి “రెడ్డి సంఘం తెలంగాణ” రాష్ట్ర నాయకుల వినతి పత్రం
ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, వినతి పత్రాలు అందజేత
“రెడ్డి కార్పోరేషన్” కు చట్టబద్ధత కల్పించాలి.
-నిధులు, విధివిధానాలపై స్పష్టతనివ్వాలి.
-రెడ్డి కార్పోరేషన్ చైర్మన్, పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి “రెడ్డి సంఘం తెలంగాణ”రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో పలు కీలక సూచనలు వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, వినతి పత్రాలు అందజేశారు.
అనేక సంవత్సరాల నిరుపేద రెడ్ల పోరాటాలను, నిరుపేద రెడ్డి విద్యార్థులకు అగ్రకులం పేరుతో ఉపాధి అవకాశాలలో ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకపోవడం వలన, వాటి ఫలాలు పొందలేకపోతున్నారన్న విషయం మీకు విదితమే నని, గత పది సంవత్సరాలలో నిరుపేద రెడ్ల కోసం జరిపిన సభలు, సమావేశాలు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు- ధర్నాలు రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినప్పటికీ, నిరుపేద రెడ్లకోసం ఉద్యమాలతో పాటు అనేక పట్టణాలలో, గ్రామాలలో రెడ్డి పరపతి సంఘాలు – రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు కొంతమేరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం వంద రోజులలో “రెడ్డి కార్పోరేషన్” ఏర్పాటు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. కానీ నేటివరకు విధివిధానాలు ప్రకటించలేదు, పాలకవర్గాన్ని ప్రకటించలేదు. దీనివల్ల నిరుపేద రెడ్లు ఆశించిన ఫలితం రాలేదని తీవ్ర ఆవేదనకు, మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు అని అన్నారు.
కావున దయచేసి వెంటనే రెడ్డి కార్పోరేషన్ చట్టబద్ధతతో పాటు నిధులు కేటాయించాలని, విధివిధానాలు ప్రకటించాలని, రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గాన్ని కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. నిరుపేద రెడ్డిలకు న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు విన్నవించడం జరిగింది.
అంతేకాకుండా నిరుపేద రెడ్డి యువతీ-యువకులకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉ పయోగకరమైన ఈడబ్ల్యూఎస్ (EWS) ను విద్యా, ఉద్యోగ అవకాశాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మరియు “EWS ఈడబ్ల్యూఎస్ EWS కమీషన్” ను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయుటకు కృషిచేయాలని “రెడ్డి సంఘం తెలంగాణ” తరపున తమరికి విజ్ఞప్తి చేయుచున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం తెలంగాణ గౌరవ అధ్యక్షులు నావల్గ సత్యనారాయణ రెడ్డి, కరుణాకర్ రెడ్డి,తిరుమల్ రెడ్డి ,సలహాదారులు నూకల నరేష్ రెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ బద్దూర్ వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నల్ల సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహారెడ్డి ఎదునూరి శ్రీపతి రెడ్డి శేరి అంతిరెడ్డి, కోశాధికారి వంటేరు గోపాల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్స్ గవ్వ వంశీధర్ రెడ్డి,, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నెపల్లి లింగారెడ్డి, కార్యదర్శులు కైలా దేవేందర్ రెడ్డి ,పసుల శేఖర్ రెడ్డి ,సంగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మడప కిరణ్ కుమార్ రెడ్డి, పొన్నతోట అజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి
శరత్ రెడ్డి ,కిషన్ రెడ్డి ,దశమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.