గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా ట్యాంక్బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.
🔹గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంట గంటకూ కమాండ్ కంట్రోల్ నుంచి సిబ్బందికి అవసరమైన సూచనలిచ్చి అప్రమత్తం చేయాలని సీఎంగారు చెప్పారు.
🔹నిమజ్జన శోభాయాత్రలో సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించడం, బ్లయిండ్ స్పాట్స్, హాట్ స్పాాట్స్లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయడం వంటి పలు అంశాలపై సీఎంగారు పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.