అహంభావంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి..
హైదరాబాద్ అభివృద్ధి అందరి సహకారం తోనే సాధ్యం అయింది..
ప్రాంతీయ భేదాలు తీసుకువచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్ర చేస్తున్న ఎమ్మెల్యేలు, దయచేసి ప్రజా సమస్యలపై పోరాడండి కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయవద్దు అని విజ్ఞప్తి చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన 7లక్షల కోట్ల అప్పును తీరుస్తునే,రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వనికి సహరించాలి కానీ,సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడం చాలా సిగ్గు చేటు అని అన్నారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడు ఇలాంటి సంఘటలను చూడలేదు అని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని అడిగారు..
ప్రాంతీయ భేదాలు తీసుకువచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సబబు కాదని,ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు,అందరి సహకారంతోనే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుందని, మహిళలను అవమానిస్తూ,సంఘ విద్రోహ శక్తిగా మారుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు,మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ పార్టీని రెండు దఫాలు గెలిపిస్తే,తెలంగాణ ప్రజలను ఆగం చేసి,దోచుకు తిన్నారు.మీ అహంకారాన్ని అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారని గుర్తుచేశారు..
అధికారం పోతే ఇంత దిగిజరిపోవాలా,మీ ఓటమిని అంగీకరించకుండా ఇంకెన్నాళ్ళు ఈ నాటకాలు, ఇకనైనా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ప్రజలు ఏర్పరుచుకున్న ప్రజా ప్రభుత్వం పై బురద జల్లడం మానేసి,మీరు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని తెలిపారు..
ఏమేం తప్పులు చేశారో తెలుసుకుని సరిదిద్దుకోవాలి కానీ..మీ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి,మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇలాంటి కారణాలు చెప్పి దుష్ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పదం అని అన్నారు..