మనలో అజ్ఞాన పొరలు తొలగించి,జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు…
గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని మహీంద్రా అశ్విత వయోవృదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులను సన్మానించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర,గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ…
దేవుడు,గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అని,ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే అని వివరించారు.సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది…
మనలో అజ్ఞాన పొరలు తొలగించి,జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట.అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది…
దేశానికి,రాష్ట్రానికి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు,సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు,ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు.అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు అని,శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే,గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు,ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి,విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు.అందుకే పెద్దలు *మాతృదేవో భవ..పితృదేవో భవ..* ఆచార్య దేవోభవ అన్నారు అని గుర్తు చేశారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్,జీవి రెడ్డి,రాజేష్,సత్యం,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..