ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు. #TeachersDay