పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్: హిమాచల్ ప్రదేశ్
ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేకు పింఛన్ సౌకర్యాన్ని తొలగిస్తూ తీసుకొచ్చిన కొత్త బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది
హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీలు మారిన, ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయం నిలిపివేసింది .
ఈ ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు, మరియు ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సమయంలోనూ పార్టీ విప్ ను కాదని వీరు సభలకు హాజరు కాలేదు. దాంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు
పడింది.