శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి..
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జి.ఎం.బ్రిజేష్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ముఖ్యంగా హాఫీజ్ పెట్ ఫ్లైఓవర్ నుంచి చందనగర్ వరకు మంజీర రోడ్డులో చేప్పట్టిన పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పనులు చేప్పట్టేందుకు కృషి చేయాలని కోరారు..
###################### హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి..
హఫీజ్ పెట్ జిఎం కార్యాలయం..
######################
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకంలో,గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి దిశనిర్దేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ముందుకు సాగుతున్నామని,నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం తమవంతు కృషి చేస్తానని తెలిపారు,మంజీర పైప్ లైన్ పనులతో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చెప్పటడం జరుగుతుందని,త్వరలో రోడ్డు నిర్మాణం పనులు పుర్తి చేసేలా కృషి చేస్తామని అన్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..
ఈరోజు హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి జిఎం గారిని కలిసి మియపూర్,హాఫీజ్ పెట్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,లింగంపల్లి పరిధిలో నూతన పనులకు ఎస్టిమేషన్లు సిద్ధం చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న మంజీర పైప్ లైన్ పనులను మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను త్వరగా పూర్తి చేయాలని,మియపూర్ డివిజన్ పరిధిలోని నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులు,గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులు,మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్,అపర్ణ కౌంటీ డ్రైనేజ పైప్ లైన్ పనులు,చందనగర్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన డ్రైనేజ పైప్ లైన్ పనులపై హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి జిఎం శ్రీ.బ్రిజేష్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు..
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ,మౌళికవసతులు కల్పనకు పెద్దపిట వేస్తామని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా,ప్రజలకు సౌకర్యవంతమైన,మెరుగైన జీవన విధానాన్ని,సౌకర్యం కల్పించడం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు..