ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో నూతన కమిటీ ఎన్నిక
కమిటీ సభ్యులను అభినందించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్
ఆగస్ట్ 25, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజత నగర్ వికర్ సెక్షన్ బస్తీలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా బస్తీలో, స్మశానవాటికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బస్తి కమిటీ సభ్యులు వినతిపత్రాన్ని అందించారు, త్వరలో బస్తీ పనులపై సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో బస్తి నూతన అధ్యక్షులు మూడవత్ కృష్ణ నాయక్, గౌరవ అధ్యక్షులు నీలం బ్రహ్మయ్య యాదవ్, గౌరవ సలహాదారులు తలారి కేశవులు, రామచందర్ యాదవ్ ఉపాధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, చింతల తిరుపతయ్య, జెట్టి హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అలీమ్, రమేష్ నాయక్ ఎలకంటి చందు, సెక్రెటరీ, రజనీకాంత్ రెడ్డి, బద్రి నాయక్, జనరల్ సెక్రెటరీ స్వామి, చాట్ల కోటయ్య, శశిధర్ యాదవ్, కోశాధికారి సుధాకర్ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నకేశవులు, తలారి నాగులు, జాయింట్ సెక్రటరీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, మెంబెర్స్ జల్లి తిరుపతిరెడ్డి,నరసింహ ముదిరాజ్, కే దేవయ్య, బాబు ముదిరాజ్, ఎం మధు, బాలస్వామి ముదిరాజ్, శాలయ్య తదితరులు పాల్గొన్నారు..