శ్రీ హేమ దుర్గామాత దేవాలయ 24 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
ఆగస్ట్ 25, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
మియపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ హేమదుర్గా మాత దేవాలయ 24వ వార్షికోత్సవా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అభిషేకాలు, హోమం, కుంకుమార్చనలు అన్నదానం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీసులు ఎల్లపుడు ఉండాలని వి.జగదీశ్వర్ గౌడ్ ప్రార్ధించారు..