గచ్చిబౌలి డివిజన్ లో బీజేపీ పార్టీకి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ………………………………………
అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్,బీఆర్ఎస్ నుండి బీజేపీ లో చేరిక…………………………………..
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు…………
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునియప్ప, శంకర్, రాజు, మనస్, కరుణాకర్, విఠల్ గార్లు గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి సమక్షంలో కార్పొరేటర్ గారి కార్యాలయం లో బీజేపీ పార్టీలో చేరారు.వారికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చుపించిందని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం,అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదని అన్నారు. బీజేపీ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, మన్నే రమేష్, రాజు , గోపాల్ ప్రభాకర్, సురేష్, రాజు, నగేష్ ,వెంకట్, మని, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు