తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 20 26లు జనాభా లెక్కల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153 మూడు శాసనసభ స్థానాలకు పెంచనున్నట్లు లోకసభలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హరి భాయ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.