☸️రక్షా బంధన్-బౌద్ధ బంధం☸️
ఐదుగురు వ్యక్తులను, నాలుగు దేశాలను, మూడు సంస్కృతులను, రెండు ఖండాలను, ఏకం చేసిన ఏకైక బంధం రాఖీ-బంధన్.
కౄరుడైన అలెగ్జాoడర్ ను మార్చి స్వేచ్ఛ, సమత, సౌబ్రాతృత్వాన్ని చాటిచెప్పే బౌద్ధ-సంస్కృతిని ఖండాంతరాలకు విస్తరింపచేసి, గ్రీక్-బౌద్ధ సంసృతుల సమ్మిళిత సంసృతికి పునాదులు వేసిన గొప్ప సాంసృతిక వేడుకైన ఈ రక్షా-బంధన్ చారిత్రక నేపధ్యాన్ని పరిశీలిద్దాం.
ప్రపంచ సంపదను దోచి, మాసిడోనియాను మహా సంపన్నదేశంగా మార్చి, మూడు ఖండాల రాజులకు ముచ్చెమటలు పట్టించిన అలెగ్జాండర్ మాసిడోనియకు 20ఏళ్ల వయసులోనే మహారాజైనాడు. 30సంవత్సరాల వయసునాటికే గ్రీస్ నుండి వాయువ్య భారతం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడు. ఇతని గురువు ప్రపంచ ఖ్యాతిగాంచిన తత్వవేత్త అరిస్టాటిల్.
అలెగ్జాండర్ ఆసియా ఖండంలో తన దండయాత్ర కొనసాగిస్తూ బాక్ట్రియన్ ను పాలిస్తున్న బౌద్ధ మహారాజు ఆక్సీఆర్ట్ ను ఓడించి, అతని కుమార్తె అయిన రుక్సాన(రెగ్జోనా సబ్బుకు ఆమెపేరే పెట్టారు.) అందాన్ని, అనుకూవతను, నిరాడంబరతను చూసి, అలెగ్జాoడర్ తన రెండవ భార్యగా స్వీకరించాడు. రుక్సాన తండ్రి అయిన ఆక్సీఆర్ట్(భారతీయ భాషలో ఎలా ఉచ్చరించారో దొరకలేదు.) ను ఆ ప్రాంతానికి రాజ ప్రతినిధిగా నియమించి, భారత ఉపఖండం వైపు తన సైన్యాన్ని నడిపించాడు.
అలెగ్జాండర్ దండయాత్రను ముందే పసిగట్టిన తక్షశిలా బ్రాహ్మణ రాజు ఓంపిస్(అంబి) అలెగ్జాoడర్ ను ఆహ్వానించాడు. కానీ, అక్కడి గిరిజన తెగలు గెరిల్లాదాడులుచేసి నివారించే ప్రయత్నం చేశారు. ఆ గిరిజన నాయకులూ లొంగిపోవడానికి నిరాకరించారు. ఆస్పసియాయిలు, అస్సకేనోయి, కాంబోజులను నివారించడంలో అంబి సహకరించాడు. అంతేకాకుండా పోరస్(పురుషోత్తముడు) పై దాడికి అలెగ్జాoడర్ కు 5000 సైన్యాన్ని ఇచ్చి, జీలం నది దాటడానికి తాత్కాలిక వంతెన నిర్మించి యుద్ధానికి సహకరించాడు.
పొరస్ (పురుషోత్తముడు) జీలం(హైడాస్సెస్) మరియు చీనాబ్ నది మధ్య ప్రాంతాన్ని పాలించే గొప్పరాజు. ఈ ప్రాంతం ప్రస్తుతం పంజాబ్ లో ఉన్నది. క్రీ.పూ.326 లో అలెగ్జాoడర్ కు మరియు పొరస్ కు హైడాస్పస్ చారిత్రాత్మక యుద్ధం జరిగినది. ఈ యుద్ధం నాటిచరిత్ర స్థితిగతులనే మార్చేసింది. అలసిపోయిన మాసిడోనియా సైన్యం పురుషోత్తమున్ని ఎదుర్కోవడం కష్ట సాధ్యమైనది.
ఈ నెత్తుటి యుద్ధంలో గాయాల పాలైన వీర సైనికులకు, శత్రు సైనికులతో సహా తంతిమిస్ (భారతీయ భాషలో ఎలా ఉత్సరించారో దొరకలేదు.)అనే బౌద్ధ భిక్కు మరియు వారి భిక్కుఘనం సైనికులకు వైద్య సేవలు అందించడం అలెగ్జాoడర్ ను ఆశ్చర్య చకితుణ్ణి చేసింది.
అలెగ్జాoడర్ గుర్రానికి మరియు తనకు గాయలై దారి తప్పిన పరిస్థితిలో ఒక గిరిజన యువతి “లాచి” వైద్యసేవలు అందించి, సపర్యలు చేసినది. తను మాసిడోనియా మహారాజునని ప్రపంచాన్ని జయించడానికి వచ్చానని తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. అందుకు ఆ యువతి “నీవు ఎవరైతే నాకేంటి?, నీవు గాయాలతో నిస్సాహాయస్థితిలో ఉన్నావు. నీకు వైద్యం చేయడం మనిషిగా నా కర్తవ్యం. అయినా ప్రాణం తీయడం చాలా సులువు. ప్రాణం నిలపడం ఎంతోకష్టం” అంటూ తనధోరణిలో తాను చెప్పింది. ఈ విషయం కూడా అలెగ్జాoడర్ కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత సహనం, ఓర్పు, తాత్వికత ఎలా అబ్బాయని అడిగాడు. అందుకు బౌద్ధం గురించి, తంతిమిస్ భిక్కు గురించి అలెగ్జాoడర్ కు వివరించింది. ఎలాగైనా తంతిమిస్ ను కలవాలని నిశ్చయించుకున్నాడు అలెగ్జాండర్.
రోజు లాగానే యుద్ధం విరమించిన తర్వాత సాయంత్రవేళల్లో వందలాది మంది బౌద్ధ భిక్కులు క్షతగాత్రులైన సైనికులకు వైద్యం చేయడాన్ని రోజు గమనిస్తూనే ఉన్నాడు. కానీ సైన్యంలో ఓడిపోతామనే ఒక బయం కూడా చూశాడు అలెగ్జాండర్. తనకు గూడా అదే అనుమానం కలిగినది. తన భావాలను రుక్సానాతో పంచుకున్నాడు.
ఆ రోజు శ్రావణపౌర్ణమి, భిక్కులు వర్షావాసం చేస్తున్నారు. ఉపాసికా ఉపాసకులు విహారాలకు వెళ్లి దమ్మశ్రావణం చేస్తుంటారు. అనంతరం ఒకరికికొకరు రక్షాబంధనం ధరిస్తున్నారు. ఇది నేటికి విహారాల్లో ఈ సాంప్రదాయాన్ని బౌద్ధులు ఆచరిసస్తూనే వున్నారు. రుక్సాన పురుషోత్తముడికి రక్షా బంధనం చేసి ఒక చిన్న కోరిక కోరుకుంటుంది. “నా భర్త యుద్ధ రంగంలో గనుక నిరాయుధుడై నీ కంట పడితే నా భర్తను ప్రాణాలతో వదిలెయ్యి” అని కోరుకుంటుంది. రుక్సాన కు పురుశోత్తముడు హామీ ఇచ్చాడు.
మరుసటి రోజు యుద్ధరంగంలో అదే జరిగినది. పురుషోత్తముడు కూడా ఒడిపోయేస్థితిలో ఉన్నాడు. పురుషోత్తమునికి అలెగ్జాండర్ కు భీకర యుద్ధం జరుగుతూవున్నది. పురుషోత్తముడు అలెగ్జాండర్ పై కత్తిలేపాడు. ముందురోజు రుక్సాన కట్టిన రక్షాబంధన్ చూసి, ఎత్తిన కత్తి దించి,సంధికి సిద్ధపడ్డాడు. అంతకు ముందు వీరి మధ్య అంబి రాజు సంధికి ప్రయత్నం చేసినాడు. అది కూడా ఒక అనుకూల వాతావరణానికి దారి తీసింది. పురుషోత్తముని ఔధార్యం రాజనీతిని గౌరవించి ఆ ప్రాంతానికి రాజ ప్రతినిధిగా నియమించి,తన ప్రాణాలను కాపాడిన లాచిని వివాహం చేసుకొమ్మని పురుశోత్తమున్ని కోరినాడు. అందుకు పురుశోత్తముడు అంగీకరించి లాచిని తన భార్యగా స్వీకరించాడు.
“ఇంత గొప్ప సాంస్కృతిక కట్టుబాట్లు కలిగివున్న శ్రావణ పౌర్ణమి రోజు, కరడుకట్టిన కౄరమైన అలెగ్జాoడర్ లో ఎంతో మార్పు తెచ్చినది. బౌద్ధ సంస్కృతి ఖండాంతరాలకు విస్తరింపబడిన రోజుగా చరిత్రపుటల్లో నిలిచింది. వర్షావాసంలో ఉన్న బౌద్ధ భిక్షువులచే ధమ్మ బోధనలు శ్రావణంచేసి,అనంతరం ధమ్మ రక్ష ధరించి, సోదర భావాన్ని పెంపొందించుకుంటారు. అయితే ఇది కాలక్రమంలో విహారాలు కనుమరుగైనా ఈ సాంస్కృతిక అవశేషాలు ఇంకా ప్రజాజీవనంలో సజీవంగా నిలిచిపోయాయి. ఇప్పుడు కేవలం తమ ఇళ్ళకు పరిమితమైపోయి, అన్నచెళ్ళళ్ళమధ్య అనురాగం నింపుతూ చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిపోయింది.”
తన దండయాత్ర వలన జరిగిన విధ్వంసం పట్ల అలెగ్జాండర్ పశ్చాత్తాపం చెందిన అలెగ్జాoడర్ లో కలిగిన ఈ మార్పు అతనితో అంతం కాకూడదని భావించాడు. ఇతను ఎంతో గొప్ప తాత్వికుడు. ఈ బౌద్ధ తాత్విక జ్ఞానం యూరప్ కు అవసరమని గుర్తించి, బౌద్ధ భిక్షువు తంతిమిస్ ద్వారా పొందిన బౌద్ధ జ్ఞానాన్ని తోలు, రెళ్ళపొదలు,చెట్ల బెరళ్లతో తయారు చేయబడిన ఒక రకమైన కాగితంపై వ్రాసి, కూజలలో భద్రపరచి, తోళ్ళతో బిగించి గుర్రాలపైన మరియు ఏనుగులపైన మాసిడోనియాకు తరలించారు. వాటితోపాటు అనేకమంది బౌద్ధ భిక్షువులను వెంట తీసుకెళ్లారు. ఈ కారణంగా బౌద్ధ గ్రీకు సంస్కృతులు సమ్మిళితమై ఒక మార్మిక ఉద్యమం ఈజిప్ట్ లో మొదలై క్రైస్తవమత ఆవిర్భావానికి దోహదపడింది. అందుకే నేటికి ఈ రెండుమతాలలో సారూప్యత కనిపిస్తుంది.
క్రీ.పూ 323లో 32 సంవత్సరాల వయసులో బాబిలోన్(ప్రస్తుత ఇరాక్) ప్రాంతానికి చేరుకున్నాక ఒక అంతుపట్టని వ్యాధితో అలెగ్జాoడర్ మరణించాడు. తాను మరణించ బోతున్నాను అని తెలుసుకున్న అలెగ్జాందర్ తన వీలునామాలో తన శవపేటికను వైద్యులే ఖననం చేయాలనీ, తను సంపాదించిన ధనాన్ని దారివెంట పరుచుకుంటూ (పంచుకుంటూ) వెళ్ళాలని, తన చేతులను పేటిక బయట ఉంచి ఖననం చేయాలనీ ఈ మూడు అంశాలు ఉద్గాటించాడు. అయితే నేటికీ మన సమాజంలో కూడా అటు ఇటుగా ఇదే సాంప్రదాయలను పాటిస్తున్నాం. చనిపోయిన వక్తి అంతిమ యాత్రలో తాను సంపాదించిన ఆస్తిని తనపై చళ్ళుతూ తీసుకెళ్ళి ఖననం చేస్తారు. అంటే ఈ సాంప్రదాయం బౌద్దులదే.
“శ్రవణ పౌర్ణమి రక్షా బంధం” చారిత్రక సత్యాన్ని అర్ధం చేసుకుని బౌద్ధ సాంసృతి చుట్టూ వేరే కథలు ప్రచారంలో ఉండి అసలు చరిత్ర సంస్కృతులు అర్ధం కాకుండా పోయాయి. మన సంస్కృతే మనకు నేడు పరాయి సంస్కృతిగా కనిపిస్తుంది. ఇలాంటి సత్య సంస్కృతులను వెలికి తీసి, ఈ ఉత్సవాన్ని బౌద్ధీకరించి మన ఇళ్ళల్లో, సంఘాల్లో, విహారాల్లో విరివిగా జరుపుకుందాం. భాయచారత్వాన్ని(సహోధరత్వాన్ని) మేలుగొలుపుకుందాం.
జై భీం!
జై భారత్!!
నమో బుద్ధాయ!!!
మీ శీలం
తేదీ:19.08.2024