ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం
రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్ సర్వాయి పాపన్న
ఆగస్ట్ 18, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు, సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా.. బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌడ సంఘం నాయకులు బొమ్మేన రాజయ్య గౌడ్, నల్లగొని బాలకిషన్ గౌడ్, బొమ్మేన అంజనైయులు గౌడ్, వేముల వెంకట్ గౌడ్, పంజాల శ్రీధర్ గౌడ్, ముసిని రాజు గౌడ్, కక్కెర్ల రాజు గౌడ్, కక్కెర్ల విజయ్ గౌడ్, భైరగోని కనకయ్య గౌడ్, బొమ్మేన సందీప్ గౌడ్, అందె పర్శరాములు గౌడ్, బైరు వెంకటేష్ గౌడ్, అందె దివాకర్ గౌడ్, మోహన్ గౌడ్, బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు