#Jai_Hind #IndiaAt78
#Happy_Independence_Day
ప్రజలందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్,లింగంపల్లి డివిజన్,చందనగర్ డివిజన్,మియపూర్ మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని అనేక చోట్లా జాతీయ జెండాను మాదాపూర్ డివిజన్ నియోజకవర్గ/డివిజన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని,అనేకమంది జైలు జీవితం గడిపారని,బ్రిటిష్ వారు విధించే చిత్ర వేదనలను భరిస్తూ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల అందరికీ మనం కృతజ్ఞతతో ఉండాలని గుర్తుచేశారు….
మన హృదయాన్ని కదిలించే అనేక స్వాతంత్ర పోరాట సంఘటనలను భావితరాలకు అందించేందుకు వేడుకలను వినియోగించుకోవాలని తెలిపారు,స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,వార్డ్ సభ్యులు,ఏరియా సభ్యులు,బస్తి కమిటీ సభ్యులు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు..