మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరత మాత ముద్దుబిడ్డలకు వందనం అభివందనం : హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి
ఆగస్ట్ 15, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
హఫీజ్ పేట్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నల్ల సంజీవరెడ్డి జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరత మాత ముద్దుబిడ్డలకు వందనం అభివందనం తెలుపుతూ.. మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల కష్ట ఫలితమని దానిని సద్వినియోగంగా ఉపయోగించుకుంటూ మంచి కార్యక్రమాల కోసం పాటుపడుతూ మన దేశం, ప్రాంతం అభివృద్ధి కోసం అందరం కష్టపడాలని ఆమె కోరారు. శేర్లింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ కార్యదర్శి ముద్దంగుల తిరుపతి మరియు హఫీజ్ పేట్ డివిజన్ లోని వివిధ కాలనీల అసోసియేషన్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, నివాసితులు, తదితరులు పెద్ద సంఖ్యలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు.