రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు
ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని అధికారుల సూచన
ఆగస్ట్ 12, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
రాష్ట్రంలో విష జ్వరాలు తీవ్రస్థాయిలో పంజా విసురుతున్నాయి. ఈ విష జ్వరాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు విష జ్వరాల వ్యాప్తి సర్వసాధారణం. కలుషిత నీటితో, దోమలు, ఈగలతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా, డయేరియా లాంటి అనేక రోగాలు తీవ్రస్థాయిలో ప్రజలపై విరుచుకు పడుతున్నాయి.
ఏజెన్సీ జిల్లాల్లో అయితే మరి దారుణమైన పరిస్థితి నెలకొంది ప్రతి ఇంటికి ఒకరిద్దరు బాధితులు ఉన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 3000 డెంగీ, 6500 మలేరియా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు దొరకక, ఇళ్ల వద్దే వైద్య చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులకు లోటు ఉన్నట్లు తెలుస్తుంది. ఆసిఫాబాద్ లో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో 8 నెలల శిశువు మృతి చెందింది. దోమల నివారణ చర్యలలో భాగంగా ఫాగింగ్ కూడా చేయట్లేదనీ ప్రజలు అంటున్నారు.
ఈ వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని ముఖ్యంగా దోమల నుండి రక్షించుకోవడానికి దోమతెరలు ఉపయోగించుకుంటూ శుభ్రమైన కాచి వడపోసిన నీటిని తాగాలని, వేడి గా ఆహార పదార్థాలను తినాలని, బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య అధికారులు తెలుపుతున్నారు. తమ ఆరోగ్యం తమ చేతిలోనే ఉందని జాగ్రత్తగా వ్యవహరించి సీజనల్ వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.