జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
ఆర్టీసీ బస్సులో జర్నలిస్టులను అవమానించడానికి తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు
వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మృతి చెందిన జర్నలిస్టు యోగి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఆగస్టు 11, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :
వరంగల్లో ఆర్టీసీ బస్సు ఎక్కి జనగామ కు వస్తున్న జర్నలిస్టులఫై దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్, కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని జనగామ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జనగామ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ రిపోర్టర్ పాలమాకుల జితేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి పని చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం వరంగల్లో ఆర్టిసి బస్సు ఎక్కిన కొందరు జర్నలిస్టు లపై ఆ బస్సు డ్రైవర్ కండక్టర్లు దురుసుగా ప్రవర్తించి, అవమానించిన వారిపై శాఖా పరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామలో ఓ జర్నలిస్టు చనిపోగా అంతిమ యాత్రలో పాల్గొనడానికి వస్తున్న జర్నలిస్టులను బస్సు దిగమని అవమానించడం దారుణం అన్నారు. పురుషుగా ప్రవర్తించిన డ్రైవర్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని మరొకసారి ఇలాంటి సంఘటనలతో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆయా రంగాలలో నెలకొన్న సమస్యలను జర్నలిస్టులు ప్రజల దృష్టికి తీసుకు వస్తున్నప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం వరంగల్లో మరణించిన జర్నలిస్ట్ యోగి అతని కూతురు మరణం పట్ల జనగామ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు రెండు నిమిషాలు మౌనంపాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ రిపోర్టర్లు బత్తిని అశోక్, చీల కిరణ్ కుమార్, గుడికందుల కృష్ణ, వీరస్వామి, ఏం లక్ష్మారెడ్డి, ఓంకార్, రవి, అప్రోజ్, క్రాంతి కుమార్, ఉపేందర్, ప్రవీణ్, బాలు, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.
జనగామ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్ రిపోర్టర్ పి.జితేందర్.