జర్నలిస్ట్ యోగి రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
AIFDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున
ఆగస్టు 11, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :
ఆగస్టు 9 తేదీన ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏ ఐ ఫ్ డి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 11-8-2024 రోజున ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్ నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ… జర్నలిస్ట్ యోగి రెడ్డి నికచ్చితమైన, నిజాయితీ గల వ్యక్తి యోగి, అందరిలో కలిసిమెలిసి అందరితో మంచిగా ఉండేవాడు తన సొంతంగా రీల్స్ చేస్తూ, మరొక ఛానల్ లో పనిచేస్తున్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు తాళలేక కూతురితో సహా తన సొంత ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన చాలా బాధాకరం సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపించే జర్నలిస్టుకే ఈ విధంగా ఇబ్బందులు అయితే ప్రభుత్వం పట్టించుకోకుంటుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? జర్నలిస్టులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ యోగి రెడ్డి