ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజీవ్ యువ వికాస పథకం వర్తింప చేయడం పట్ల హర్షం:EWS వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం అగ్రవర్ణ పేద కులాల నిరుద్యోగ యువతకు వర్తింపచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు నిర్ణయించడం పట్ల ఈడబ్య్లూఎస్ వ్యవస్థస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం కింద దరఖాస్తు తేదీని ఏప్రిల్ 5వ తేదీ బదులు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించాలని నల్ల సంజీవ రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రంలో ఈడబ్య్లూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇట్టి కార్పొరేషన్
ద్వారా ఈ పథకం అమలు చేయాలని నల్ల సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఉపాధిలేక తీవ్ర నిరాశలో ఉన్న అగ్రవర్ణ నిరుపేద యువతి యువకులందరికి ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని నల్ల సంజీవ రెడ్డి తెలిపారు.