ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి : వి.జగదీశ్వర్ గౌడ్
శివాజీ మహరాజ్ శోభయాత్రను జెండా ఊపి ప్రారంభించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
ఫిబ్రవరి 16, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :
మియపూర్ డివిజన్ పరిధిలోని శివాలయం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ శోభయాత్రను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు మియాపూర్ డివిజన్ పరిధిలోని శివాలయం నుండి తారానగర్ శ్రీ తుల్జా భవాని ఆలయం వరకు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, మల్లేష్, యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయుల సంరక్షణకి అనేక యుద్ధాలు చేసిన మహావీరుడని, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వీరమల్ల వీరేందర్ గౌడ్, జిహెచ్ఎంసి లేబర్ సెల్ కార్యదర్శి ముద్దంగుల తిరుపతి నియోజకవర్గ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు,రామచందర్ గౌడ్,రవి కుమార్,రాంబాబు,నవీన్,లక్ష్మీ,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.