బీఎస్ఎన్ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో
నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్
సెప్టెంబర్ 04, నల్లా సమాచార్ న్యూస్ :
వినియోగదారులకు రీఛార్జి ధరలు భారీగా పెంపు ద్వారా షాక్ ఇచ్చిన జియో సంస్థకు వినియోదారులు వేరే నెట్వర్క్ లకు పోర్ట్ ద్వారా భారీ సంఖ్యలో మారుతూ షాక్ ఇచ్చారు.
ముఖ్యంగా చౌకగా రీఛార్జి ధరలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కు మారడానికి ఎక్కువ మొగ్గు చూపడంతో జియో సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. నెలకు రూ.173 మాత్రమే వెచ్చించాలా రూ.1,889 ప్లాన్ ని తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు.
ఈ ప్లాన్లో కస్టమర్లు దేశంలో ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్ల యాక్సెస్తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా
నెలవారీ ప్లాన్ రూ. 189
అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు 2జీబీ డేటా