నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606
హైదరాబాద్: ఈరోజు బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ గారు నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని కొనియాడారు.
మహిళల మధ్య బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరగడం, మన సంప్రదాయాలను నిలుపుకోవడంలో మహిళల పాత్ర ఎంతో ప్రాముఖ్యమని ఆమె తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగను పురస్కరించుకుని, అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ వేడుకలో బౌద్ధ నగర్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహభరితంగా ఈ పండుగను జరుపుకున్నారు.