శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21(నల్లా సమాచార్ న్యూస్)శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ గ్రామంలో మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డును వేలంపాట 11వ రోజు మంగళవారం నాడు నిర్వహించారు. మూడు లక్షల 45వేల రూపాయలకు ఇరుకులపాటి సోమశేఖర్ దివ్యభారతి దంపతులు లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ లంబోదరుడి లడ్డు తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఇరుకులపాటి సోమశేఖర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వేలం పాటలో లడ్డు కైవసం చేసుకోవడానికి పలువురు పోటీ పడినప్పటికీ చివరకు ఇరుకులపాటి సోమశేఖర్ దంపతులకు ప్రతిష్టాత్మకమైన గణేశుడి మహా ప్రసాదమైన లడ్డును దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మరొక లడ్డు లక్కీ డ్రా విజేత ఆర్ఎల్పీ కుటుంబం కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మహాగణపతి లడ్డు వేలం పాటలో లడ్డును కైవసం చేసుకున్న ఇరుకులపాటి సోమశేఖర్ దివ్యభారతి దంపతులు
